భూపాల‌ప‌ల్లి కేటీపీపీలో భారీ పేలుడు : ముగ్గురి పరిస్థితి విషమం

జయశంకర్‌ భూపాల‌ప‌ల్లిలోని కాక‌తీయ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ (కేటీపీపీ)లో సోమ‌వారం రాత్రి భారీ ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలు కాగా..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఒకటో యూనిట్‌లో మిల్లర్‌ పేలడం తో ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు కార‌ణంగా ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఓ వైపు మంట‌ల‌ను అదుపు చేసే ప‌నిని చేప‌ట్టిన అధికారులు.. మరోపక్క క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.