వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి నిప్పు

ఘటనతో పూర్తిగా దగ్ధమైన రథం

temple-chariot
temple-chariot

బిట్రగుంట: ఈరోజు తెల్లవారు జామున నెల్లూరు జిల్లా బిట్రగుంట వేంకటేశ్వరస్వామి ఆలయం పరిధిలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి రథం దగ్ధమైంది. మార్చి 4న రథోత్సవం జరుగనున్నాయి.కాగా గుర్తు తెలియని వ్యక్తులు రథానికి నిప్పంటించడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నారు. ఆలయానికి చెందిన ఈ ప్రాచీన రథం ఆవరణలో నిలిపి ఉంటుంది. ఏటా బ్రహ్మోత్సవా సందర్భంగా స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంలో రథాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి భక్తులు కన్నువ పండువగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. మరో పక్షం రోజుల తర్వాత ఉత్సవం జరగనున్న నేపథ్యంలో జరిగిన ఘటనతో భక్తులు నొచ్చుకున్నారు.ఘటనపై వెంటనే స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితులను తక్షణం పట్టుకోవాలని ఆదేశించారు. అలాగే ఆకతాయిల చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తక్షణం పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/