రంగమార్తాండకు మరో దెబ్బ.. ఎక్కడా దొరకడం లేదట!

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంవీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రంగమార్తాండ’ మొదట్నుండీ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఈ దర్శకుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుండీ ఏదో ఒక రూపంలో ఈ సినిమాకు కష్టాలు వస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా మెజారిటీ షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇటీవల సినిమా షూటింగ్‌లు ప్రారంభం కావడంతో రంగమార్తాండ చిత్ర షూటింగ్‌ను కూడా తిరిగి ప్రారంభించారు. అయితే అనుకున్న దానికంటే కూడా ఈ సినిమాకు ఎక్కువ బడ్జెట్ అవుతుండటంతో చిత్ర నిర్మాత ఈ సినిమా చేయనంటూ చేతులెత్తేశాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఏ ఒక్కరూ ఈ సినిమాకు ఫైనాన్స్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని, అందుకే ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు నిర్మాత తెలిపినట్లు సమాచారం.

దీంతో కృష్ణవంశీ ఎంతో కష్టపడి చేస్తున్న రంగమార్తాండ చిత్రం ఆగిపోవడంతో ఈ సినిమా మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ఎవరు ముందుకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కృష్ణవంశీ ఈ సినిమా బడ్జెట్ విషయంలో వేసుకున్న లెక్కలు తారుమారయ్యాయని స్పష్టం అవుతోంది.