రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం ₹13.7లక్షల కోట్లు కేటాయిస్తాం. రైల్వేకు ₹2.4లక్షల కోట్లు ఇస్తున్నాం. 2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్ల నిధులు కేటాయించాం. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు. పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు. మూలధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం’’ అని నిర్మల వెల్లడించారు.
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్ల నిధులు
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్ల నిధులు. ఎంఎస్ఈలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరణ. 5జీ సేవల యాప్ల అభివృద్ధికి వంద పరిశోధనా సంస్థలు. 50 ఎయిర్పోర్టుల పునరుద్ధరణ. ట్రాన్స్పోర్టు రంగానికి ప్రాధాన్యతన. క్లీన్ ప్లాంట్ కార్యక్రమానికి రూ. 2 వేల కోట్లు. మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు. వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
కర్ణాటకకు రూ. 5,300 కోట్లు..
ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయింపు. కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, సాగునీటి రంగానికి రూ. 5,300 కోట్లు.
విద్యుత్ రంగానికి రూ. 35 వేల కోట్లు..
నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్కు రూ. 19,700 కోట్లు కేటాయింపు. విద్యుత్ రంగానికి రూ. 35 వేల కోట్లు. ఏడాదికి అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ రూ. 10 వేల కోట్లు. గోబర్దన్ స్కీం కింద 200 బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు. లడాఖ్లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు. ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ. 38 వేల కోట్లు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం.
కాలం చెల్లిన వాహనాల తొలగింపు మా తక్షణ ప్రాధాన్యం
కాలం చెల్లిన వాహనాల తొలగింపు మా తక్షణ ప్రాధాన్యం. కేంద్ర ప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు. కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు సాయం అందిస్తాం. వాహనాల తుక్కు కోసం మరిన్ని నిధులు కేటాయింపు.
కృత్రిమ వజ్రాలకు కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
కృత్రిమ వజ్రాలపై పరిశోధన చేసే ఐఐటీలకు ప్రత్యేక గ్రాంట్లు. కృత్రిమ వజ్రాలకు కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.
150కు పైగా మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చాం- నిర్మలా సీతారామన్
2014 నుంచి దేశవ్యాప్తంగా 150కు పైగా మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చాం. త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతాం. ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాం. వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాం. అధ్యాపకుల శిక్షణకు డిజిటల్ విద్యావిధానం, జాతీయ డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తాం.
మూలధన వ్యయాన్ని పెంచాం – నిర్మలా సీతారామన్
మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మా మూడవ ప్రాధాన్యత అని.. ప్రభుత్వం మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచిందని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు వీలుగా దీన్ని పెంచారు. ఇది ఉపాధికి దోహదపడుతుంది.
గిరిజన సమూహాల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు..
PMBPTG డెవలప్మెంట్ మిషన్ ప్రత్యేకంగా గిరిజన సమూహాల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రారంభించబడుతుంది. తద్వారా PBTG నివాసాలకు ప్రాథమిక సౌకర్యాలు అందించబడతాయి. రూ. 15,000 కోట్లు వచ్చే 3 సంవత్సరాలలో ఈ పథకాన్ని అమలు చేయడానికి అందుబాటులో ఉంచబడతాయి.
KYC ప్రక్రియ సులభతరం చేశాం – నిర్మలా సీతారామన్
KYC ప్రక్రియ సులభతరం చేయబడుతుంది. ఆర్థిక వ్యవస్థతో మాట్లాడటం ద్వారా ఇది పూర్తిగా డిజిటలైజ్ చేయబడుతుంది. ఒక స్టాప్ పరిష్కారం. గుర్తింపు, చిరునామా కోసం చేయబడుతుంది. డిజి సర్వీస్ లాక్, ఆధార్ ద్వారా ఇది వన్ స్టాప్ సొల్యూషన్గా చేయబడుతుంది. అన్ని డిజిటల్ సిస్టమ్లకు పాన్ గుర్తించబడుతుంది. ఏకీకృత ఫైలింగ్ ప్రక్రియ సెటప్ చేయబడుతుంది. కామన్ పోర్టల్ ద్వారా ఒకే చోట డేటా ఉంటుంది. అది వివిధ ఏజెన్సీలు ఉపయోగించుకోగలుగుతుంది. పదే పదే డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే దీని కోసం వినియోగదారు సమ్మతి చాలా ముఖ్యం.
గృహ కొనుగోలుదారులకు శుభవార్త..
కొత్తగా ఇల్లు కొనుగోలు, నూతన గృహాలు నిర్మించుకునేవారి కోసం మోదీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ఈ సారి బడ్జెట్లో నిధులను భారీగా పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు రూ. 48 వేల కోట్ల కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం.
దేశ, విదేశీ పర్యాటకులు పర్యాటకంపై స్పెషల్ ఫోకస్..
ప్రజలకు హరిత ఉద్యోగావకాశాలు కల్పించామని, దేశ, విదేశీ పర్యాటకులు పర్యాటకంలో గణనీయమైన సహకారం అందించారని ఆర్థిక మంత్రి అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ద్వారా టూరిజం ప్రమోషన్ కొత్త స్థాయికి తీసుకెళ్లబడింది. హైడ్రోజన్ మిషన్ కోసం ప్రభుత్వం రూ.19700 కోట్లు కేటాయించింది. మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు