రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. బడ్జెట్ అంశాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వివరించారు. ఆమె వెంట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు డా. భగవత్ కిషన్రావ్ కారడ్, శ్రీ పంకజ్ ఛౌదరీ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. 2022-23 బడ్జెట్ను ఆమోదించనుంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/