ప్రభుత్వ హాస్పిటల్‌ను బార్‌గా మార్చిన సిబ్బంది..

ప్రభుత్వ హాస్పటల్ ను ఏకంగా బార్ గా మార్చిన వైనం హన్మకొండ మిషన్ హాస్పటల్ లో చోటుచేసుకుంది. సాయంత్రం కాగానే హాస్పటల్ సిబ్బంది ఓ రూమ్ లో మందు దావత్ చేసుకొని అడ్డాగా దొరికారు. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. నిత్యం పేషంట్లతో బిజీ గా ఉండే మిషన్ హాస్పటల్ లో పేషంట్లను గాలికి వదిలేసి , ఆరోగ్యశ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్సు, మరొక GNM బీర్ తో తాగుతూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు.

ఈ వైనం చూసిన పేషంట్ తాలూకా బంధువులు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆసుపత్రి ఉన్నతాధికారులకు విషయం తెలిసింది. సిబ్బంది ఫై చర్యలు తీసుకోవాలని పేషంట్స్ తాలూకా బంధువులు , స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.