తాడేపల్లి లో అమానవీయ ఘటన..కూతురి ఫై తండ్రి అత్యాచారం

15-teachers-allegedly-gang-raped-5-students-in-rajasthan

ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నా కూతురి ఫై తండ్రి అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో కామం ముసుగులో వావివరుసలు మరచిపోతున్నారు. తోబుట్టువులనే కాదు కన్నా బిడ్డలను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం.. బతుకు తెరువు కోసం 12 ఏళ్ల క్రితం తాడేపల్లికి వలస వచ్చారు. అప్పటి నుండి సీలింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.. ఐదుగురు పిల్లలతో కలసి తాడేపల్లి పట్టాభిరామ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఫుల్ గా మద్యం సేవించిన తండ్రి.. తన నాలుగో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంగతి తెలుసుకున్న తల్లి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరుకు తరలించారు. ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కామాంధుడి ఫై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.