బంజారాల పునరుజ్జీవ పితామహుడు
నేడు సేవాలాల్ జయంతి
సేవాలాల్ మహారాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా గుత్తిలో రామావత్ భీమనాయక్, ధర్మణి బాయిలకు 1739 ఫిబ్రవరి 15వ తేదీని మొదటి సంతానంగా జన్మించారు. వీరు కడపటి మొగల్ చక్రవర్తులు, అసఫ్జహీల కాలానికి చెందినవారు. సేవాలాల్ ఒక సామాజిక చైతన్యకారి బిడారు వర్తకంపై ఆయా రాజులు విధించే సుంకాలను బంజా రాలు కట్టవద్దని స్వయంగా ఎదురించిన వ్యక్తి. ఆంగ్లేయులు వారి పాశ్చాత్య సంస్కృతిని, మత మార్పిడిలకు బలవంతం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బంజారాలు ఆంగ్లే యులకు వస్తూ మార్పిడీలు చేయడానికి సహాయపడేవారు. వీరు వస్తువ్ఞలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి ఎడ్ల బండ్లను, గుర్రాలను ఉపయోగించి ఆహార ధాన్యాలను, చిరు, తృణధాన్యాలను, కూరగాయాలను, వారికి అవసరమైన ఇతర వస్తువ్ఞలను మైసూరు,బొంబాయి,బందరు, మద్రాసు నగరాలకు తరలించేవారు.
వీరి కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఇచ్చేవారు కాదు. వారి నుంచి రావలసిన కష్టార్జి తాన్ని ప్రతిఘటించి పొందెలా చేసేవారు. గోవ్ఞలె వీరికి జీవన వృత్తి. గోవ్ఞలను పూజిస్తారు. పశువ్ఞలు రోగాలతో మరణిస్తే తమ పంటపొల్లాల్లో ఒక మూలకు పూడ్చిపెట్టి దానిపై ఒక చెట్టును పెట్టే ఆచారం నేటికీ ఉందంటే ఆది సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గమే. దీన్ని ఆధారంగా చేసుకొనే ఆర్యసమాజం 1882లో గోసంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టిం దని చెప్పవచ్చు.
సేవాలాల్ నిరక్షరాస్యుడు అయినప్పటికీ అతనికి ఆధ్యాత్మిక భక్తి,శక్తులతో చివరి వరకు నీతికి, నిజాయి తీకి పెద్దపీటను వేసి బంజారా జాతికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తిగా చెప్పవచ్చు. వీరు సమాజంలో నెలకొన్న మూఢనమ్మ కాలను, మద్యపానం వలన కలిగే నష్టాలను, దేవతల పేరిట ఇచ్చే జంతుబలులను అరికట్టాలని ఆనాడే ప్రజలలో చైతన్యం తెచ్చిన ఘనుడు. వితంతువ్ఞ లకు పెళ్లి చేసే ఆచారాన్ని ప్రవేశపెట్టారు. అది ఇప్పటి లంబాడి తండాలలో కనిపిస్తుంది.
ఈ ఆచారాన్నే 1856లో ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఆనాటి గవర్నర్ జనరల్ డల్హౌసి కాలంలో తీసుకొచ్చా రని పేర్కొనవచ్చు. ఒక రోజు సేవాలాల్ తండావారిని సమా వేశపరిచి వారికి ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ సకల చరాచర జగత్తు భగవంతునిలో లీనమై ఉంది. అటువంటి భగవంతుని చేరాలంటే భక్తి సరైన మార్గం. మన మనసుకు అంటిన మలినాన్ని భక్తితో కడిగితే ఆత్మకి మోక్షం వస్తుందని ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండా లని అన్నారు.
అలాగే తమ పూర్వీకుల ఆత్మశాంతించాలంటే పంట ఇంటికి వచ్చిన తర్వాత ఆ ధాన్యం నుంచి కొంత తసుకొని దంచి బోగ్భండారో చేయాలని, ఏదైన తాగే పానియాలైతే కొద్దిగా కుడి చేతితో తీసుకొని భూమిపై ధారపోస్తే వారు శాంతిస్తారని, మన మంచి చెడ్డలకు మనమే కారణమని, పుణ్యం చేస్తే ఆనందంగాను, పాపం చేస్తే బాధతోను మరణిస్తామని బోధించారు. సేవాలాల్ తనకోసం కంటే బంజారాల కోసమే ఎక్కువగా పాటుపడేవారు. ప్రతి ఫలం లేకుండా ఆయుర్వేద వైద్యం చేసేవారు. జన్మతః సాంప్రదాయం కట్టుబాట్లపైనే పూర్తిగా జ్ఞానం కలవాడు యజ్ఞప్రసాదం వల్లనే జన్మించిన వారు కాబట్టి వారు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు.
మహారాజ్ మహారాష్ట్రలోని పౌరఘడిలో 12 ఫిబ్రవరి 1806లో తుదిశ్వాస విడిచినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. దీంతో పౌరఘడ్లో వర్ధంతి, గుత్తిలో జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ‘పితృదేవోభవ అనేది వారి పూర్వం నుంచి చూడవచ్చు. దేవ్ఞడు ఉన్నాడో లేడో తెలియదు కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే ప్రత్యక్షదైవం అని నమ్మి వారిని తరతరాలుగా ఆరాధిస్తూ వస్తున్నారు. అలా పూజాపురస్కా రాలు పొందుతూ ఈ నాటికి వచ్చేసరికి దేవ్ఞళ్లుగా పూజింపబడుతున్నారు. సేవాలాల్ మహారాజ్ కూడా అదే జాతి కోసం చేసిన సేవే ఈ రోజు ఆయనను బంజారాలందరు దేవ్ఞనితో సమానంగా కాశ్మీర్ నుంచి కాన్యాకుమారి, గుజరాత్ నుంచి అరుణాచల్ప్రదేశ్ వరకు దేశం మొత్తం ‘భోగ్ భండారో నిర్వహిస్తున్నారు.
అలా పూజాపురస్కా రాలు పొందుతూ ఈ నాటికి వచ్చేసరికి దేవ్ఞళ్లుగా పూజింపబడుతున్నారు. సేవాలాల్ మహారాజ్ కూడా అదే జాతి కోసం చేసిన సేవే ఈ రోజు ఆయనను బంజారాలందరు దేవ్ఞనితో సమానంగా కాశ్మీర్ నుంచి కాన్యాకుమారి, గుజరాత్ నుంచి అరుణాచల్ప్రదేశ్ వరకు దేశం మొత్తం ‘భోగ్ భండారో నిర్వహిస్తున్నారు.
- దారవత్ వరహల్నాథ్
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/