నల్లగొండ జిల్లాలో ఘోర కారు రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

నల్లగొండ జిల్లాలో ఘోర కారు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఇనుపాముల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇనుపాముల వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. అనంతరం కారులో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని , మంటలను అదుపుచేసి బాధితులను కారులోనుంచి బయటకు తీశారు. అనంతరం నకిరేకల్‌లోని ప్రభుత్వ హోస్పేటలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మృతిచెందిన వారిని తల్లి కరుణ, కుమారుడు ఫణికుమార్‌గా గుర్తించారు. బాధితులంతా సూర్యాపేట వాసులని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.