మంత్రి హారీష్ రావు కు ఊహించని షాక్
తెలంగాణ మంత్రి హారీష్ రావు కు రైతుల నుండి ఊహించని ఎదురైంది. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో వరి కొనుగోలు వ్యవహారం ఫై రైతులు రాష్ట్ర సర్కార్ ఫై ఆగ్రహంగా ఉన్నారు. సర్కార్ మాత్రం కేంద్రం ఫై ఆగ్రహం గా ఉంది. ఇలా రాష్ట్ర సర్కార్ , కేంద్ర వ్యవహారం లలో రైతులు నష్టపోతున్నారు. వరి ధాన్యాన్ని తీసుకొని మార్కెట్ కు వెళ్తే కొనేవారు లేరని వారంతా వాపోతున్నారు.
ఈ క్రమంలో మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం నాందేడ్ అఖోల 161వ. జాతీయ రహదారి పై మంత్రి హరీష్ రావు కాన్వాయిని అడ్డుకున్నారు రైతులు. దీంతో కార్ దిగి రైతులతో హరీష్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కొనుగోళల్లో రైతులకు ఇబ్బందులు కలిగించకుండా వరి దాన్యం కొనుగోలు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే… తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని హారీష్ రావు అన్నారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు.