పురుగు మందు డబ్బాలతో రైతుల నిరసన
తేమ సాకుతో పంట కొనుగోలు చేయడం లేదని రైతుల ఆవేదన
జగిత్యాల: జగిత్యాల , సిరిసిల్ల జిల్లాలో సాకులు చెబుతు తమ దాన్యాన్ని కొనుగొలు చేయడం లేదని రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెపిపారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లు మూతపడడంతో గ్రామాలలోనే పంట కొనుగొలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో గ్రామలలో పంట కొనుగొలకు వెళ్లే అధికారులు తమ పంటలను సాకులు చెబుతు కొనుగొలు చేయడంలేదని రైతుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ పేరోతో పంటలను కొనడానికి ముందుకు రావడంలేదని ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కొనుగోలు చేయక పోతే ఏలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/