ఎమ్మెల్యె కారు అద్దాలు పగలగొట్టిన రైతులు
లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
అమరావతి: చినకాకాని వద్ద వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యె పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై అమరావతి ప్రాంత రైతులు దాడి చేసిన సంగతి తెలిసిందే. రాజధానిని అమరావతి నుంచి తరలించరాదంటూ చినకాకాని వద్ద రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఇదే సమయంలో పిన్నెల్లి అటువైపుగా వచ్చారు. ఈ సందర్భంగా పిన్నెల్లి వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. వెంటనే కిందకు దిగిన గన్ మెన్ ఓ రైతుపై చేయిచేసుకున్నారు. దీంతో, రైతులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. గన్ మెన్ పై దాడి చేశారు. కారు అద్దాలను పగలగొట్టారు. ఈ ఘర్షణ సమయంలోనే పెన్నెల్లి వాహనం అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/