లోకేష్ ఫై తన అభిమానాన్ని చాటుకున్న యువ రైతు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై అమరావతి ప్రాంతానికి చెందిన యువ రైతు తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎకరా పొలంలో లోకేష్ ఫొటో రూపంలో వరి పండించాడు. ఈ నెల 23న లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందులో పండించిన వరి ధాన్యాన్ని లోకేష్‌కు బహుమతిగా అందించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ నెల 27 నుండి లోకేష్ పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర విజయవంతమవ్వాలని పచ్చని పంటద్వారా శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ నెల 27 న కుప్పం నుండి లోకేష్ యాత్ర మొదలుకాబోతుంది. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు నడవబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో దాదాపు రాష్ట్రంలోని ముఖ్యమైన నియోజకవర్గాన్నింటినీ కవర్ చేయనున్నారు.