రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు
భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా వీర్ భూమిలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ లు రాజీవ్ సమాధి వద్ద శ్రద్దాంజలు ఘటించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు.
1944 ఆగస్టు 20న ముంబైలో రాజీవ్ గాంధీ జన్మించారు. 1984 అక్టోబరులో ఆయన దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి రాజీవ్ గాంధీ సరికొత్త రికార్డు సృష్టించారు. 1989 డిసెంబర్ 2 వరకూ ప్రధానిగా పని చేశారు రాజీవ్ గాంధీ. కాగా మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాందీ మృతి చెందారు.