పండగవేళ హైదరాబాద్ లో విషాదం
పండగవేళ హైదరాబాద్ లోని తార్నాక లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. తార్నాకలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ప్రతాప్ తన భార్య తో పాటు తన నాలుగేళ్ల బాలిక , మరో మహిళ ఇలా మొత్తం నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. మృతుల్లో దంపతులు, నాలుగేళ్ల బాలిక, మరో మహిళ ఉన్నారు.
అపార్ట్మెంట్ వాసుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భార్య, కూతురు, తల్లిని చంపి ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురిని గొంతు నులిమి చంపిన ప్రతాప్.. అనంతరం ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు ప్రతాప్ (34), సింధూర (32), ఆద్య(4), ప్రతాప్ తల్లి రాజతిగా గుర్తించారు. సింధూర ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుండగా.. ప్రతాప్ ఓ కార్ షోరూమ్లో డిజైన్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.