మాస్కులు ధరించకపోతే..సమాధి తవ్వాల్సిందే

తూర్పు జావా గ్రేసిక్‌ రీజెన్సీ ప్రాంతంలో శిక్ష అమలు

face-mask-refuseniks-indonesia-forced-dig-graves-coronavirus

జకర్తా: కరోనా నియంత్రణకు నిబంధనలు పాటించని వారికి పలు దేశాల్లో భారీగా జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండోనేషియాలోని జావాకు చెందిన అధికారులు వినూత్న రీతిలో శిక్ష అమలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరిగే వారిని పట్టుకుని గోతులు తవ్వే శిక్షను విధిస్తున్నారు. కరోనా సోకి చనిపోయిన వారిని ఖననం చేయడానికి అవసరమైన గోతులను తీయడానికి తూర్పు జావా గ్రేసిక్‌ రీజెన్సీ ప్రాంతంలో మనుషులు కరవయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గోతులు తీసే కార్మికులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పనిని మాస్కులు ధరించకుండా తిరుగుతోన్న వారికి అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఎనిమిది మంది వ్యక్తులకు ఈ శిక్ష అమలు చేశారు. గుంతలు తీయించి, వారితోనే మృతదేహం ఉన్న చెక్కపెట్టెలను పాతిపెట్టించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/