మద్యం పేరుతో విపరీతంగా దోపిడి చేస్తున్నారు
ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోల పట్ల అప్రమత్తంగా ఉండాలి
అమరావతి: వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నవరత్నాలు పేరుతో చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకుపోతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన పాలన మీద ఆయనకే నమ్మకం లేదని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న విషపూరిత జీవోల పట్ల అప్రమత్తం ఉండలన్నారు. మద్యం పేరుతో విపరీతంగా దోపిడీ చేస్తున్నారని, పెట్రోల్, విద్యుత్ చార్జీలు పెంచారని మండిపడ్డారు. త్వరలో రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెంచబోతున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి జరుగతోందన్నారు. భయబ్రాంతులకు గురిచేసి స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు యత్నాలు జరుగుతున్నాయని, అధికారపార్టీ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని కన్నా పిలుపునిచ్చారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/