అమ్మఒడి సంక్షేమ పథకం కాదు మంచి సంస్కరణ

పేద పిల్లల చదువు గురించి ఆలోచించి విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది సీఎం జగన్‌ మాత్రమే

vallabhaneni vamsi
vallabhaneni vamsi

హైదరాబాద్‌: ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా పేద పిల్లల చదువు గురించి ఆలోచించలేదని ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ అన్నారు. పేదపిల్లల చదువు గురించి ఆలోచించి ఇంత విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమేనని వల్లభనేని వంశీ ప్రశంసించారు. అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అమ్మఒడిని ఒక సంక్షేమ పథకంగా కాకుండా ఒక మంచి సంస్కరణగా భావిస్తున్నాని వంశీ అన్నారు. టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టిడిపి నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గత టిడిపి ప్రభుత్వంలోని వారు మా పిల్లల్ని ఎక్కడ చదివించుకుందాం, వాడు ఎంత పప్పు అయిన సరే స్టాన్‌ ఫోర్డులో చదివించుకుందామా, ఇంకోచోట చదివించుకుందామా అని ఆలోచించేవారే తప్ప, పేద పిల్లల గురించి ఆలోచించలేదని ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సీఎం జగన్‌ అభినందిచాల్సిన అవసరం ఉందని వల్లభ నేని వంశీ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/