ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది..తలసాని

ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి

minister-talasani-srinivas-yadav

హైదరాబాద్‌: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం సనత్ నగర్ లోని కెయల్రార్ పార్క్ వద్ద త్వరలో జరగనున్న హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్స్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2017 కు ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో ఓటరుగా నమోదు చేసుకున్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నవంబర్ 6 వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/