సిఏఏపై వెనక్కి తగ్గిన యూరోపియన్ యూనియన్
బ్రస్సెల్స్: భారత ప్రభుత్వం తీసుకుచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)పై వ్యతిరేక తీర్మానం తీసుకువచ్చే విషయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) వెనక్కి తగ్గింది. సిఏఏ వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్ నిర్వహించే అంశాన్ని ఈయూ రద్దు చేసింది. సిఏఏ ద్వారా భారత్ లో ముస్లింలపై వివక్ష ప్రదర్శితమవుతుందని ఈయూలోని కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సిఏఏ భారత అంతర్గత వ్యవహారమని, దీంట్లో అంతర్జాతీయ జోక్యానికి ఆస్కారం లేదని భారత్ దౌత్యపరమైన గొంతుక వినిపించింది. చట్టపరమైన ప్రక్రియల అనంతరమే సిఏఏ తీసుకువచ్చామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈయూ తన నిర్ణయాన్ని పక్కనబెట్టడం భారత్ కు లభించిన దౌత్య విజయంగా పేర్కొనవచ్చు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/