ఉపఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్న ఈటెల

హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం నువ్వా నేనా అనేంతలా సాగిస్తుంది. అధికార పార్టీ నేతలంతా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఈటెల ను ఓడించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఈటెల సైతం గెలుపు నాదే అన్నట్లు ప్రచారం చేస్తూ ఓటర్లకు నమ్మకం కలిగిస్తున్నారు.

సోమవారం కమలాపూర్ లో మాట్లాడుతూ..హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. తాను హుజూరాబాద్ లో అభివృద్ధి చేయలేదని హరీష్ రావు అనడం సిగ్గు చేటన్నారు. మీ మామ ఆదేశాలతో నా గొంతు పిసకాలని నా దగ్గరికి వచ్చావు.. ఏదో ఒక రోజు హరీశ్ గొంతు కూడా పిసకడం ఖాయమన్నారు. మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఓ సర్వేలో దేశంలోనే అతిపెద్ద అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తేలిందన్నారు. ఏడేళ్లలో కేసీఆర్ ఆయన కుటుంబం రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుందని ఆరోపించారు.