ఉప ఎన్నిక వ‌స్తుందంటే కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టిస్తారు

ఇప్ప‌టికైనా ఇక్కడి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చాలి..ఈట‌ల

హైదరాబాద్: అధికారంలో ఉన్ననాడు, అధికారంలో లేనినాడు ప్ర‌తి స‌మ‌యంలో నేను ప్ర‌జ‌ల హృద‌యాల్లో చోటు సంపాదించుకుని వారి మెప్పుపొందిన బిడ్డ‌గా ఉన్నాను అని ఈట‌ల అన్నారు. ఉప ఎన్నిక వ‌స్తుందంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టిస్తారని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్‌కి రాజీనామా చేసి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌లంద‌రూ నాతో చెబుతున్నారు. భ‌ర్త చ‌నిపోతే భార్య‌కు పింఛ‌ను రావాలని, కానీ రావ‌ట్లేద‌ని అన్నారు. పింఛ‌న్లు ఆగిపోయాయి అని చెప్పారు. రెండున్న‌రేళ్లుగా కొత్త రేష‌న్ కార్డులు ఇవ్వ‌ట్లేద‌ని తెలిపారు. రాజీనామా త‌ర్వాత ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌ను నా దృష్టికి తీసుకొచ్చారు’ అని ఈట‌ల చెప్పారు.


హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో తెల్ల రేష‌న్ కార్డులు, పింఛ‌న్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి. అదే విధంగా 58 ఏళ్లు నిండిన అంద‌రికీ పింఛ‌న్లు ఇవ్వాలి. 2018 ఎన్నిక‌ల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పారు. ఇప్పుడు ఇవ్వండి. హుజూరాబాద్‌లో మీకు ఓట్లు కావాలి కాబ‌ట్టి ఇప్ప‌టికైనా నిరుద్యోగ భృతి ఇవ్వాలి’ అని ఈట‌ల డిమాండ్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/