బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం..

బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి మల్లయ్య (104) అనారోగ్యంతో మరణించారు. ఆరోగ్య సమస్యల కారణంగా మల్లయ్యను సిద్ధిపేటలోని ఆర్వీఎం హాస్పిటల్‌లో చేర్పించగా.. మంగళవారం రాత్రి డాక్టర్లు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.

మల్లయ్య మరణ వార్తను ఈటల కుటుంబీకులు ధ్రువీకరించారు. కమలాపూర్‌లోని స్వగృహంలో మల్లయ్య పార్థీవ దేహాన్ని ఉంచి.. బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు. మల్లయ్యకు 8 మంది సంతానం కాగా.. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఈటల రాజేందర్ రెండో కుమారుడు.

ఇక ఈటెల రాజకీయాల విషయానికి వస్తే…టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన రాజేందర్..బిజెపి పార్టీ లో చేరి , హుజురాబాద్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. రాజేందర్ సతీమణి జమున స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలోనే ఉండటంతో.. ఆయన అక్కడే స్వయంగా అక్కడే ఉండి.. ఉపఎన్నిక కోసం పనిచేస్తున్నారు.