కేటీఆర్ హుజురాబాద్ ఓటమి ముందే గ్రహించాడు – ఈటెల

హుజురాబాద్ లో తెరాస ఓటమి ఖాయమని మంత్రి కేటీఆర్ ముందే గ్రహించాడని ..బిజెపి నేత ఈటెల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఓటుకు లక్ష ఇచ్చిన కానీ గెలుపు నాదే అని మరోసారి స్పష్టం చేసారు. బుధువారం జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ..తన గెలుపు తర్వాత తెలంగాణవ్యాప్తంగా పెనుమార్పు వస్తుందని, ఇన్నాళ్లుగా రాష్ట్రం కోల్పోయిన ప్రతిష్ఠ పెరుగుతుందని కొండబద్దలు చేసారు. హుజూరాబాద్‌‌లో టీఆర్ఎస్ ఓడిపోతే ప్రభుత్వం కూలిపోదన్న కేటీఆర్‌ ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకొన్నారని ఈటెల అన్నారు. ఇక నియోజకవర్గంలో తనను ఎవరు కలవకుండా తెరాస నేతలు చేస్తున్నారని..నేతలను , అభిమానులను బెదిరించి వారి వైపు తిప్పుకుంటున్నారని ఈటెల అన్నారు.

ప్రభుత్వం ఎన్ని నివేదికలు తెప్పించుకుంటున్నా తానే గెలుస్తాననని స్పష్టంగా అర్ధమవుతోందని, అందుకే సీఎం తనపై చిల్లర కుట్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు తన ఫొటో పెట్టుకుంటేనే గెలుస్తామనే ధీమా నుంచి ఇప్పుడు మండలస్థాయి పర్యటనలకు కూడా కేసీఆర్‌ సిద్ధమయ్యారంటే ఆయనకు ఓటమి భయం పట్టుకుందని స్పష్టం గా తెలుస్తుందని ఈటెల అన్నారు. నియోజకవర్గం లో కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన ఓటర్లు మాత్రం ఈటెల కే మా ఓటు అని ఫిక్స్ అయ్యారని ..అది ఫలితాలతో కేసీఆర్ కు తెలుస్తుందని ఈటెల ధీమా వ్యక్తం చేసారు.