మహిళా క్రికెటర్లకు శుభవార్త తెలిపిన బీసీసీఐ
ఇకపై మహిళా క్రికెటర్లకూ మగవాళ్లతో సమానంగా ఫీజు

ముంబయి: బీసీసీఐ మహిళా క్రికెటర్లకు శుభవార్త తెలిపింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు చెల్లించనున్నట్లు ప్రకటించింది. పురుషులు, మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను సమం చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. క్రికెట్ లో లింగ సమానత్వానికి పెద్దపీట వేస్తున్నామని, మహిళలకూ పురుషులతో సమానంగా ఫీజులు చెల్లించాలని నిర్ణయించామని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న రెండో దేశంగా భారత్ నిలిచింది. గత జూలైలో న్యూజీలాండ్ కూడా మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయించింది.