రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఉప్పర్ పల్లి కోర్టులో నేడు విచారణ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ఈ నెల 6న ఉప్పర్ పల్లి కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో విచారణ ఉప్పర్ పల్లి కోర్టు విచారణ చేపట్టింది. కాగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఫాంహౌస్పై డ్రోన్ ఎగురవేసిన కారణంగా రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే నేటి విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/