ఎదురుకాల్పులు..ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అవంతీపొరాలోని వాఘమా ప్రాంతంలో ఈరోజు ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా లిస్తున్నారని, ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపారు. మృతిచెందిన ఉగ్రవాది ఏ గ్రూప్నకు చెందినవాడనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/