జమ్ము కశ్మీర్‌‌లో ఎన్ కౌంటర్ : ఉగ్ర‌వాది మృతి

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్ లోని షోపియాన్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. షోపియాన్‌లోని తుక్వాన్‌గామ్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కార్డన్‌ సెర్చ్‌నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముష్కరుడు హతమయ్యాడని పోలీసులు తెలిపారు. అతడు ఏగ్రూప్‌నకు చెందినవాడనే విషయం గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/