ప్రేమికుల రోజున పార్కులన్నీ ఖాళీ

empty-parks-on-valentines-day-in-hyderabad-
empty-parks-on-valentines-day-in-hyderabad-

హైదరాబాద్‌: ఓ వైపు ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పార్కులు, హోటల్స్, పర్యాటక ప్రాంతాల్లో ప్రేమికులు సందడి చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో మాత్రం పార్కులన్నీ బోసిపోయి కన్పిస్తున్నాయి. ప్రేమికుల రోజు సందడిగా మారే పార్కులన్నీ ఎవరూ లేక కళతప్పాయి. అసలు ఈరోజూ ప్రేమికుల దినోత్సమేనా అన్న అనుమానాలొచ్చే పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన హెచ్చరికలే. పార్కుల్లో ప్రేమజంటలు కన్పిస్తే.. అక్కడికక్కడే పెళ్లి చేయడంతో పాటు తల్లిదండ్రుల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని ఇప్పటికే వారు ప్రకటించారు. దాంతో ప్రేమికులు పార్కుల వైపు తొంగిచూడడం మానేశారు. కనీసం సాధారణ రోజుల్లో వచ్చే యువత సైతం పార్కుల్లో కన్పించకపోవడం గమనార్హం. గతంలో ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు.. పార్కులు ప్రేమ జంటలతో కళకళలాడేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రేమికులు ట్రెండ్‌ను మార్చేశారు. పార్కుల నుంచి కాస్త హోటల్స్, రెస్టారెంట్లకు తమ మకాం మర్చారు. పార్కులకు వెళ్లి పరేషాన్ అయ్యే కంటే.. హోటళ్లు, రెస్టారెంట్లలో కూర్చోని తాపీగా ఊసులాడుకోవచ్చని భావిస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/