సిఎం భార్యతో కలిసి స్టేజిపై నృత్యం చేసిన రాష్ట్రపతి ముర్ము
సిక్కింలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీః రాష్ట్రపతి ద్రౌపది ముర్మురెండు రోజుల పర్యటనలో భాగంగా గ్యాంగ్ టక్ చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గంగా ప్రసాద్ ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం భార్యతో కలిసి రాష్ట్రపతి ముర్ము స్టేజిపై నృత్యం చేశారు. అనంతరం ముర్ము మాట్లాడుతూ.. అత్యంత సుందరమైన రాష్ట్రాలలో సిక్కిం ఒకటని చెప్పారు. మంచుతో నిండిన శిఖరాలు, అడవులతో వివిధ వర్గాల సంస్కృతులతో గొప్ప వారసత్వ సంపదను సిక్కిం కలిగి ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్యాంగ్ టక్ లో ‘సమైక్య నృత్యం’కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణా రాయ్ తో కలిసి రాష్ట్రపతి ఈ కార్యక్రమాని హాజరయ్యారు. వేదికపై స్థానిక కళాకారుల బృందం నృత్యం చేస్తుండగా.. కృష్ణా రాయ్ తో కలిసి రాష్ట్రపతి ముర్ము కాలుకదిపారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/