ఉచిత రేషన్ కోసం వృద్ధులు, మహిళల కష్టాలు
ఎండ తీవ్రతతో దుకాణాల ముందు పడిగాపులు
East Godavari: ఉచిత రేషన్ పంపిణీ వృద్దులు, మహిళల పాలిట ప్రాణాంతకంగా మారింది.. ఒక పక్క కరోనా వైరస్ నివారణా చర్యలు, మరో పక్క ఎండ తీవ్రతతో రేషన్ దుకాణాల ముందు పడిగాపులు పడలేక సొమ్మసిల్లి పోతున్నారు.
దుకాణాల వద్ద సామాజిక వ్యక్తిగత దూరం కోసం సర్కిళ్లు మాత్రం ఏర్పాటు చేసిన సివిల్ సప్లయిస్ అధికారులు ఎండ తీవ్రత నుంచి ప్రజలను కాపాడటానికి ఎటువంటి నీడలూ ఏర్పాటు చేయలేదు. దీంతో మండుటెండలోనే రేషన్ కోసం ప్రజలు వేచి వుండాల్సి వచ్చింది.
రేషన్ కార్డులన్నీ మహిళల పేరునే వుండటంతో సహజంగానే మహిళలు ఎక్కువగా రేషన్ దుకాణాల వద్ద కనిపించారు. ఎండలో నిలుచోలేక తమ సంచులనే లైన్ లో వుంచారు
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/