మూసీ ప్రాజెక్ట్‎ 8 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్ : మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది.. దీంతో ప్రాజెక్ట్ 8 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి 13,401 క్యూసెక్కుల వరద వస్తోంది. 13,401 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 638.50 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. మూసీ గరిష్ట సామర్థ్యం 4.46 టీఎంసీలు ఉండగా.. 2.88 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/