ఆటపాటలతోనే విద్యాబోధన సాగాలి

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామం\

ఆంగ్లం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది

Educational teaching by play songs

ప్రపంచ జ్ఞానానికి పునాది వేస్తున్న ఆంగ్ల పరిజ్ఞానం నేడు ప్రభుత్వ, ప్రైవేట్‌రంగంలోను ఉన్నత ఉద్యోగాల సాధనలో కూడా కీలకపాత్ర వహిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన క్రమంలో ఆంగ్లం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది. ప్రపంచ ఆధునిక సమకాలీన విజ్ఞానమంత కూడా ఆంగ్లంలో నిక్షిప్తం అవ్ఞతున్న నేపథ్యంలో ఆంగ్లభాష కేంద్రంగా నేడు అనేక ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు నెలకొల్పి పట్టణ ప్రజల పిల్లలతో పాటు గ్రామీణ ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాల పిల్లలను సైతం ఇంగ్లీష్‌ విద్యకు ఆకర్షితులను చేస్తూ విద్య వ్యాపారానికి పునాది వేస్తున్నారు. ఆంగ్లం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది

ఆంగ్ల మాధ్యమం అనేది ప్రతిష్టాత్మకమైన గొప్ప చదవని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ చదువంటే ఆంగ్ల పదజాలం, చదువంటే బూట్లు, టై,బెల్ట్‌, హోంవర్క్‌ అనే భౌతిక ప్రపంచాన్ని తల్లిదండ్రులకు పరిచయం చేసి పిల్లల మాన సిక ప్రపంచాన్ని మసకబారుస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు కోకొల్లలుగా వెలిశాయి. అదేవిధంగా ఇష్టారీతిన ఫీజులతో నిబంధనలకు విరు ద్ధంగా నాణ్యతా ప్రమాణాలులేకుండా నడిపిస్తూ విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు.

అమ్మభాష కమ్మదనం అంటూ మాతృభాషకు ప్రాముఖ్యత ఇస్తూ పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ప్రాముఖ్యత నిస్తూ విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెల్లబోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ బడులను రక్షించుకోవడానికి ఒక ప్రజాఉద్యమంగా ప్రభు త్వ ఉపాధ్యాయులు సమాజ భాగస్వామ్యంతో ప్రాథమికస్థాయి నుండే ఆంగ్ల మాధ్యమానికి పునాది వేస్తూ ప్రైవేట్‌ పాఠశాలల సూత్రాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు అత్యధిక విద్యార్థుల నమోదుతో విజయవంతంగా నడుస్తున్నాయి.

అనగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రైవేట్‌ పాఠశాలలు ఇంగ్లీష్‌ మీడియం అనే మోజు తల్లిదండ్రుల్లో ప్రచారం చేయగానే తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలకు, అదేవిధంగా అదే ఆంగ్ల మాధ్యమాన్ని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించ గానే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ గొప్ప ఇంగ్లీషు చదువ్ఞలు చదువ్ఞతున్నారనే భ్రాంతిలో జీవిస్తు న్నారు.

ఈ తరుణంలో విద్యావేత్తలు, మేధావ్ఞలు, తత్వవేత్తలు, మనస్తత్వవేత్తలు పిల్లల విద్యపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి సిద్ధాంతీకరించిన ‘కృత్యాధార విద్య ప్రయోగపూర్వక విద్య లాంటి వినూత్నమైన విధానాలకు సమకాలీన విద్యావ్యవస్థలో చోటు ఉందా? ఆంగ్ల మాధ్యమం అనే సంకెళ్ల చుట్టూ తిరుగుతున్న విద్యావ్యవస్థకు గత ముఖ్యకారణం తల్లిదండ్రుల అమాయ కత్వమా? ప్రైవేట్‌ పాఠశాల వ్యాపారమా? ప్రభుత్వ పాఠశాలల రక్షణాత్మక ధోరణి దాగి ఉందా అనేది విద్యావ్యవస్థలో రోజు రోజుకు చర్చనీయాంశంగా మారుతుంది.

పునాదిస్థాయి నుండే ఇంగ్లీష్‌ విద్యనభ్యసించాలని కలలుకంటున్న నేటి సమాజంలో అనేక కమిటీలు, కమిషన్లు చెప్పిన విద్యావిధానం, ఉపాధ్యాయు లు శిక్షణలో నేర్చుకున్న జ్ఞానం అమలు అవడానికి ఆస్కారం లేని అశాస్త్రీయ విద్యావిధానం పాఠశాలలో కొనసాగుతూ ఉంది. తద్వారా విద్యార్థులు చదువంటే అధిక మార్కులు రావాలనీ మానసిక ఒత్తిడికి గురై చదువ్ఞలో వెనుకబడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎదురవ్ఞతున్నాయి.

అదేవిధంగా నేడు ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్‌ విద్యను బోధించే తరుణంలో ఉపాధ్యా యులు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా విషయ జ్ఞానాన్ని పిల్లలపై రుద్దుతున్నారు. నేటి విద్యాసంస్థలు బట్టీ చదువ్ఞలతో ర్యాంకులను, మార్కులను చూపెడుతూ సమాజాన్ని మెప్పించే సంస్కృతిని పెంచి పోషి స్తున్నారు. పిల్లల మానసిక పరిపక్వత ఆధారంగా విద్యనందించే సంస్కృతి ప్రతిపాఠశాలలో కొనసాగాలి.

కావ్ఞన పిల్లలకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ విద్యలో ఉన్న బోధనా పద్ధతులను అవలంబిస్తూ విద్య సామర్థ్యాలను సాధించాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యారంగ నిపుణులు సూచించిన శాస్త్రీయ కరీకులంతో కూడుకున్న ప్రభుత్వ పుస్తకాలను వినియోగిస్తూ ప్రైవేట్‌ పాఠ్యపుస్తకాలను నిషేధిం చాలి. అప్పుడు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గి సృజనాత్మకతతో కూడుకున్న విద్యావిధానానికి బాటలు పడతాయి. ప్రాథమిక స్థాయిలో ఆంగ్లమాధ్యమంలో ప్రతి సబ్జెక్టును బోధించడం ద్వారా విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై బట్టి చదువ్ఞలను ఆశ్రయిస్తున్నారు.

కావ్ఞన ఆంగ్ల మాధ్యమాన్ని ఒక సబ్జెక్టుగానే బోధించాలి. లేదంటే ఆంగ్ల వాతావరణాన్ని ఉపాధ్యాయులు పాఠశాలలో కల్పిస్తూ బోధన చేయాలి. పాఠశాల విద్య అనేది విషయ పరిజ్ఞానానికి పరిమితం కాకుండా ఆటలు, పాటలు లాంటి వినోద కార్యక్రమాల ద్వారా పిల్లల్లోని ప్రతిభను వెలికితీయాలి. ప్రభుత్వపాఠశాలల ఆధునీకరణకై ప్రభుత్వం దృష్టిపెట్టి ప్రతి గ్రామంలోని విద్యార్థులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరేటట్లు ప్రోత్సహించాలి. అదేవిధంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలోని ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టాలి.

– సంపతి రమేష్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/