మురికివాడలో విద్యాసేవ
జీవన వికాసం
అందరితో కలిసి రెడ్లైట్ ఏరియాలో రాత్రిపూట పూలమ్మేదాన్ని. ఓ రోజూ పోలీసులు చూశారు. నన్నూ స్టేషన్కు తీసుకెళ్లి కాసేపయ్యాక వదిలేశారు. ఆ పని కూడా నచ్చలేదు.
మొక్కజొన్న పొత్తులు అమ్మడం మొదలుపెట్టా. డబ్బున్న పిల్లలు, మంచి మంచి దుస్తులు వేసుకున్న పిల్లలు వచ్చి పొత్తులు కొంటుంటే వారినే చూస్తూ నన్ను నేనుచూసుకుంటూ బాధపడేదాన్ని అని గతం గుర్తుచేసుకుంది చాందినీ.
స్లమ్ ఏరియాలో పనిచేయాలనే తపన చాలామందికే ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేసి, సక్సెస్ పొందేవారు కొందరే వ్ఞంటారు. స్లమ్ ఏరియాలో పేదల మధ్య సామాజిక సేవ చేయాలంటే అదంత సులభమైన పనేమీ కాదు.
పట్టుదలతోపాటు మురికివాడల ప్రజలపై అభిమానం, ప్రేమ వ్ఞండాలి. వారితో మమేకం అయిపోయి, వారి మనసును దోచుకునే ప్రయత్నం చేయాలి.
మీపక్షాన నేనున్నాను అనే భరోసా వారికి కల్పించినప్పుడు వారిమధ్య సేవ చేయడం సాధ్యమే. ఇలాంటి సేవలో ముందుకు దూసుకెళ్తున్న 22ఏళ్ల చాందినీ గురించి చాలామందికి తెలిసివ్ఞండవచ్చు.
ఆమె పేరు చాందినీ. పేరులో ఉన్న వెన్నెల జీవితంలో లేదు. కడుపేదరికం. కుటుంబ నోయిడాలో ఉండేది. ఖాదర్ అలీషా, నూర్జహాన్ల పెద్ద కూతురు ఆమె.
అయిదేళ్ల వయసులోనే కుటుంబ భారాన్ని మోసే బాధ్యతను భుజానికెత్తుకుంది చాందినీ. ప్రాణాలకు తెగించి తీగపై నడిచే విన్యాసాన్ని చేస్తూ కాసులు సంపాదించి పెట్టేది. ఊరూరా ప్రదర్శనలిస్తూ ఢిల్లీకి చేరుకుందా కుటుంబం. కొన్నాళ్లకు ఖాదర్ జబ్బుపడ్డాడు.
రోజుల్లోనే కుటుంబాన్ని అనాథగా వదిలేసి కన్నుమూశాడు. అప్పుడు చాందినీ వయసు ఎనిమిదేళ్లు. మళ్లీ నోయిడాకు వెళ్లిపోయిందా కుటుంబం. శూన్యంలోకి చూస్తున్న తల్లిని చూసి భయపడేది. తమ్ముడు ఆకలితో ఏడుస్తున్నాడని ఆమెకు
అర్ధమయ్యేది కాదు. చెల్లెలిని ఎలా ఓదార్చాలో తెలిసేది కాదు. పెందరాళే లేచి తన చిట్టి చేతులతో చిత్తు కాగితాలు ఏరేది.
రోజంతా కష్టపడితే ఓ యాభై రూపాయలు పుట్టేవి. ‘ఓ రోజూ అలాగే పిల్లలందరితో కాగితాలు ఏరడానికి వెళ్లాను. పోలీసులు వచ్చి పట్టుకున్నారు. అలా తిరిగితే స్టేషన్లో వేస్తామని భయపెట్టి ఇంటికి పంపించేశారు.
మర్నాడు మా ఇంటిపక్కనున్న అమ్మాయిల వెంట వెళ్లి పూలు అమ్మడం మొదలుపెట్టాను. అందరితో కలిసి రెడ్లైట్ ఏరియాలో రాత్రిపూట పూలమ్మేదాన్ని. ఓ రోజూ పోలీసులు చూశారు. నన్నూ స్టేషన్కు తీసుకెళ్లి కాసేపయ్యాక వదిలేశారు. ఆ పని కూడా నచ్చలేదు.
మొక్కజొన్న పొత్తులు అమ్మడం మొదలుపెట్టా. డబ్బున్న పిల్లలు, మంచి మంచి దుస్తులు వేసుకున్న పిల్లలు వచ్చి పొత్తులు కొంటుంటే వారినే చూస్తూ నన్ను నేనుచూసుకుంటూ బాధపడేదాన్ని …
అని గతం గుర్తు చేసుకుంది చాందినీ. ఏ దిక్కూ లేక సాగిపోతున్న చాందినీ జీవితంలో మొదటిసారి వెన్నెల కురిసింది.
వారుంటున్న వీధికి ఓ సేవాసంఘం వచ్చింది. నిర్వాహకులతో తనకు చదువుకోవాలని ఉందని చెప్పింది చాందినీ. వారు చేరదీశారు. అలా పదోయేట అక్షరాలు దిద్దడం నేర్చుకుంది. 18 ఏళ్లు వచ్చేవరకూ అక్కడే ఉంది. పదో తరగతి పాసైంది.
ఈ ఎనిమిదేళ్లు కేవలం చదువుకోలేదామె. మరెన్నో అద్భుతాలు సాధించింది. మురికివాడలన్నీ తిరిగి అక్కడి చిన్నారుల గురించి సర్వే చేసింది.
ఎందరో పిల్లలను ఎన్టీవోలో చేర్చింది. తనకు దక్కిన అదృష్టాన్ని మరెందరికో పంచింది. యువతిగా మారాక మరింత ఉత్సాహంతో పని చేసింది. టెడెక్స్ వంటి వేదికలపై ప్రసంగించింది.
యునైటెడ్ నేషన్ కన్వేన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ (యుఎన్సిఆర్సీ)తో కలిసి పనిచేసింది. నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్)లో భాగంగా హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో కలిసి పనిచేసింది.
ఆమె చూపిన చొరవకు ఎన్నో అవార్డులు వరించాయి. కరమ్ వీర చక్ర పురస్కారాన్ని అందుకుంది.
చాందినీకి 18 ఏళ్లు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఇక ఎన్టీవోలో ఉండకూడదన్నారు నిర్వాహకులు. చిన్నారులకు పాఠాలు చెప్పమన్నారు.
నీడలో ఉన్న చిన్నారులకు తన అవసరం లేదనుకుందామె. ఏ అవకాశం లేక మురికివాడల్లో మగ్గుతున్న పిల్లల కోసం ఏదైనా చేయాలనుకుంది. మళ్లీ మొక్కజొన్న పొత్తులు అమ్మడం మొదలుపెట్టింది.
మరోవైపు కుటుంబం కోసం దాచిన రూ.50 వేలను చిన్నారుల కోసం వినియోగించాలని నిర్ణయించుకుంది. ఈ ప్రయత్నంలో తనలా ఆలోచిస్తున్న దేవప్రతాప్ పరిచయమయ్యాడు.
ఇద్దరం కలిసి అక్కడి మురికివాడలన్నీ తిరిగేవాళ్లం. వాళ్లలో చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారిని గుర్తించాం. ఆ పిల్లలకు దుస్తులు, పుస్తకాలు కొన్నాం.
చిన్న గదిని అద్దెకు తీసుకొని 2017లో డాక్టర్ కలాం ఎడ్యుకేషన్ సెంటర్ వాయిస్ ఆఫ్ స్లమ్ అనే ఎన్టీవోను ప్రారంభించామని చెబుతుంది చాందినీ.
కొన్ని రోజులకే డబ్బులైపోయాయి. అయినా ప్రయాణం అపొద్దనుకున్నారు. ఫేస్బుక్ను ఆశ్రయించారు. కేవలం ఒక్క రూపాయి సాయం కోరారు. రెండురోజుల్లో ఏడువేలు పోగయ్యాయి.
మళ్లీ ఉత్సాహంతో ముందుకెళ్లారు. బయట నుంచి విరాళాలు రావడం మొదలైంది. దాతల చేయూతతో ముందుకువెళ్తున్నాం. ఇప్పుడు మా స్కూల్లో 370 మంది చిన్నారులు చదువుకుంటున్నారు.
వారికి ఆహారం, పుస్తకాలు సహా స్కూలు ఫీజు వరకు మేమే అందిస్తాం. ఐదో తరగతి వరకూ ఇక్కడే చదివిస్తున్నాం. తర్వాత పాఠశాలలో చేర్పిస్తున్నామని చెప్పుకొచ్చింది చాందినీ.
వంద రూపాయలకు కష్టపడిన చాందినీ ఇప్పుడు నెలకు రెండు లక్షలు ఖర్చుపెట్టి ఏడుగురు ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహిస్తోం ది.
వచ్చే అయిదేళ్లలో పది పాఠశాలలను తెరవాలన్నదే తన లక్ష్యం అంటోంది చాందినీ. తమకు ఇంత చేస్తున్న ఆమెను మురికివాడలో పిల్లలంతా స్లమ్ చాందినీ అని ముద్దుగా పిలుచుకుంటారు.
ఇన్ని ఘనతలు సాధించిన చాందినీ వయసు ఇప్పుడు 22 ఏళ్లే. మురికివాడల బతుకు చిత్రాన్ని తెలియజేస్తూ ‘స్లమ్ పోస్ట్ అనే త్రై మాసపత్రికను నిర్వహి స్తోంది.
చాందినీ. మూడునెలలకు ఒకసారి వచ్చే ఈ పత్రికలో పనిచేసేవారంతా పదేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలే. చదు వుకుంటూనే దీనికి పనిచేస్తారు. వెయ్యి పత్రికలు ప్రింట్ వేసి పాఠశాలలకు ఉచితంగా అందిస్తున్నారు.
ఓసారి 15 ఏళ్ల అమ్మాయి ఓ ఇంట్లో బందీగా ఉందన్న కథనం ఇచ్చాం. చైల్డ్లైన్ రంగంలోకి దిగి ఆమెను కాపాడింది. నేపాల్కు చెంది న పదేళ్ల అమ్మాయిని ఓ నలభై ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకొని మురికివాడలో మకాం పెట్టాడు.
ఆ చిన్నారిని అతడు, అతని సోదరుడు, మామ కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా రన్న వార్తను ప్రచురించాం.
ఇప్పుడు వాళ్లందరూ ఊచలు లెక్కపెడుతున్నారు. ఆ అమ్మాయిని తల్లి వద్దకు నేపాల్ పం పించేశామని చాందినీ వివరించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/