టాలీవుడ్ లో మరో విషాదం..ప్రముఖ ఎడిటర్ కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారకరత్న మరణ వార్త ఇంకా అందర్నీ కలిచివేస్తుండగానే..మరో విషాద వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ సీనియర్ ఎడిటర్ జీ జీ కృష్ణారావు (87) కన్నుమూశారు. బెంగుళూర్ లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

పాడవోయి భారతీయుడా అనే సినిమాతో ఎడిటర్ గా రంగప్రవేశం చేశారు. దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్, బాపు,జంధ్యాల సినిమాలకు కృష్ణారావు పనిచేసారు. ఎన్టీఆర్ బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం, శృతిలయలు, ఆపద్బాంధవుడు వంటి సూపర్ హిట్ చిత్రాలకు వర్క్ చేసారు. అలాగే నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు. హిందీ లో మిలాన్ సినిమాకు ఎడిటర్ గా పనిచేసారు. ఇలా దాదాపు 300 సినిమాలకు పైగా ఎడిటర్ గా వర్క్ చేసి తన సత్తా చాటుకున్నారు. కృష్ణారావు మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం ప్రకటిస్తున్నారు.