సోనియా గాంధీకి ఈడీ మరోసారి సమన్లు జారీ

సోనియా గాంధీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21 న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా కు ఈడీ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి జూన్ 8 నే సోనియా ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉండగా.. జూన్ 02 న ఆమె కోవిడ్ -19 బారినపడింది. ఒక వారం పాటు ఆసుపత్రిలో ఉన్న సోనియా గాంధీ తన అనారోగ్యం గురించి ఈడీకి లేఖ రాశారు. విచారణను వాయిదా వేయాలని వారిని అభ్యర్థించారు. ఈడీ ఆమె అభ్యర్థనను ఆమోదించింది.

సోనియా గాంధీ సమన్లను నాలుగు వారాలపాటు వాయిదా వేయాలనికోరారని, అందుకే జూలై 21న ఏజెన్సీ ముందు హాజరుకావాలని కోరింది’ అని ఈఢీ అధికారులు వెల్లడించారు. ఐదు రోజుల ప్రశ్నోత్తరాల సమయంలో రాహుల్ గాంధీని అడిగిన ప్రశ్నలనే సోనియా గాంధీని అడగనున్నట్లు IANSలో ఒక నివేదిక పేర్కొంది. “యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) మధ్య ఒప్పందంలో ఆమె పాత్ర గురించి మేము అడగాలి” అని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక రాహుల్ ను సైతం దాదాపు ఐదు రోజుల పాటు సుమారు 55 గంటల పాటు ఈడీ విచారించింది. సోనియా, రాహుల్​ గాంధీని కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి.