శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఈడీ సమన్లు
ముంబయి : మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఈడీ విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రూ.1,043 కోట్లు విలువైన పాత్రచాల్ భూకుంభకోణంలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఏప్రిల్లో ఈడీ జప్తు చేసింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/