తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ ఇంట్లో ఈడీ సోదాలు

తాడిపత్రిలోని జేసీ సోదరుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాకుండా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. వాహనాల కొనుగోలు విషయంలో జరిగిన లావాదేవీలపై లోతుగా పరిశీలిస్తున్నారు. తనిఖీల సమయంలో జేసీ సోదరులు ఇళ్లలోనే ఉన్నారు. శుక్రవారం తెల్లవారు జామునే ఈడీ అధికారులు ఇంటికి వచ్చి సోదాలు మొదలుపెట్టారు. ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఈడీ అధికారులు వచ్చారని తెలిసి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు.