శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌లో భారీ కుంభకోణం

హైదరాబాద్‌ నగరంలో గుర్తింపు పొందిన శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఫై ఈడీ దాడులు జరుగుతున్నాయి. బంగారం దిగుమతి విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు 2019 DRI కేసు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్, ఆయన కుమారుడు సాయి చరణ్‌ను గతంలోనే డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రావిరాల జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్ పార్కులో ఉన్న శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌లో భారీ కుంభకోనం జరిగినట్టు ఈడీ గుర్తించింది.

విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేయడంతోపాటు, 1100 కిలోల బంగారాన్ని శ్రీ కృష్ణ జ్యువెలర్స్ డైవర్ట్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించారు. ఆభరణాల ఎగుమతుల్లో సైతం స్కామ్ చేసినట్టు గుర్తించారు. దీంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌కి చెందిన షోరూంలు అన్నింటిలో ఈడీ సోదాలు చేపట్టింది. ఇక, శ్రీకృష్ణా జ్యువెలర్స్ దేశవ్యాప్తంగా మొత్తం 35 షోరూంలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.