మంత్రి తలసాని కుమారుడికి ఈడీ నోటీసులు జారీ

చికోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం

ed-issues-notice-to-minister-talasani-son-sai

హైదరాబాద్ః ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చికోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేసింది. నేపాల్ లో బిగ్ డాడీ పేరుతో నిర్వహించిన కేసినోకు వెళ్లినట్టుగా భావిస్తున్న వారికి వరుసగా నోటీసులు పంపుతూ, విచారణ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఇదే అంశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్ ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడీ విచారణకు హరీశ్ హాజరయినట్టు సమాచారం. ఇంకోవైపు ఇప్పటికే తలసాని సోదరులు తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లు కూడా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఇంకోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణ సమయంలో ఎల్.రమణ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/