మరోసారి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఈడీ సమన్లు
రాంచీః ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఇదే కేసులో ఈనెల 3న సోరెన్కు ఈడీ నోటిసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆరోజున ముందస్తుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొంటూ సీఎం సోరెన్ విచారణకు గర్హైజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తాఖీదులు ఇచ్చింది.
అక్రమ మైనింగ్ కేసులో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. జులై నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. మిశ్రాకు చెందిన 50 బ్యాంకు అకౌంట్లలో రూ.13.32 కోట్లు సీజ్ చేశారు. అదేవిధంగా ఆయన ఇట్లో లెక్కల్లోకిరాని రూ.5.34 కోట్లను గుర్తించారు. మే నెలలో సీఎం సోరెన్తోపాటు జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/