రేపు డైరెక్టర్ పూరి ని విచారించబోతున్న ఈడీ

టాలీవుడ్ ఇండస్ట్రీ కి మరోసారి డ్రగ్స్ విచారణ తలనొప్పిగా మారింది. కొంతకాలం క్రితం డ్రగ్స్ విచారణ ఎంత సంచలనం రేపిందో తెలియంది కాదు. అగ్ర దర్శకులు , నటి నటులు , టెక్నీషన్స్ ను విచారించడం జరిగింది. కొన్ని రోజుల వరకు ఈ విచారణ అందరిలో టెన్షన్ నింపగా..ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. ఇప్పుడు సడెన్ గా విచారణ కు హాజరు కావాలంటూ ఇండస్ట్రీ కి చెందిన 12 మందికి ఈడీ నోటీసులు అందజేశారు.

రేపట్నుంచి సెప్టెంబరు 22 వరకు ఈడీ విచారించనుండగా.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ రేపు విచారణకు హాజరుకానున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో మొత్తం 62 మందిని విచారించిన సిట్.. ఆఫ్రికన్ దేశాలకు చెందిన 8 మందిని నిందితులుగా చూపింది. సినీ రంగానికి చెందిన 12 మందిని విచారించింది. నేరాభియోగ పత్రాల్లో 12 మంది గురించి ఎలాంటి ప్రస్తావన సిట్‌ చేయలేదు. తాజాగా ఈడీ నోటీసులతో మరోసారి డ్రగ్స్ కేసు చర్చనీయాంశమైంది.