ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన ఈడీ

kalvakuntla kavitha
kalvakuntla kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు లో ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకు ఈడీ విజ్ఞప్తి చేసింది.

ఈడీ కేసులో మార్చి 11న విచారణ ఎదుర్కొన్న కవితను.. మార్చి 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ వేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మార్చి 24న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో కవిత పిటిషన్ పై ఈడీ కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో ఇరు వర్గాల పిటిషన్లపై మార్చి 24 న సుప్రీంలో విచారణ జరగనుంది. ఈడీతో పాటు కవిత తరపు లాయర్ వాదనలు వినిపించనున్నారు.