ఈడీ కోర్టు షాక్!
11న విచారణకు హాజరుకావాలని సమన్లు
Hyderabad: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశించింది.
ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది. దీంతో అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్ను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ క్రమంలో సీఎం జగన్తో పాటు ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/