లైకా ప్రొడక్షన్స్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు
గత కొద్దీ నెలలుగా చిత్రసీమలోని ప్రముఖ నిర్మాణ సంస్థలపై ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఫై ఈడీ సోదాలు జరుపగా..తాజాగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఫై ఈడీ సోదాలు జరుపుతున్నారు. చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఎనిమిది ప్రాంతాల్లోని కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈడీ అధికారులు వివిధ బృందాలుగా విడిపోయి మరీ సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని డీ నగర్, అడయార్, కరపాక్క తదితర ప్రాంతాల్లోని లైకా కంపెనీకి చెందిన ఎనిమిది చోట్ల దాడులు జరుగుతున్నాయి. అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపినట్లుగా సమాచారం. తనిఖీలు పూర్తయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కారణాలు తెలిపే ఛాన్స్ ఉంది.
ఇక రీసెంట్ గా లైకా నుండి పొన్నియన్ సెల్వన్-2 చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించగా.. ఐశ్వర్యరాయ్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తీ, ఐశ్వర్య మీనన్, శోభిత ధూళిపాళ తదితరులు కీలక పాత్రలు పోషించారు.