ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలకు వచ్చే నెల 6న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న పరిశీలన జరుగనుంది. మార్చి 23న పోలింగ్ నిర్వహించనుంది. అదే రోజు కౌంటింగ్ జరుగనున్నది. తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నవీన్రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.
ఈ క్రమంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఏపీలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తో పాటు బచ్చుల అర్జునుడు, వైసీపీ నేతలు పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, చల్లా భగీరథరెడ్డి (గతేడాది మరణించారు), పెన్మత్స సూర్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ ల పదవీకాలం ముగియనుంది. మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.