పరీక్షల్లో తేలికగా కోరుకున్న మార్కులు

preparing for exams

పరీక్షలు కొద్ది రోజుల్లో ఉన్నాయంటే కొందరు 24 గంటలూ పుస్తకాలతోనే గడుపుతుంటారు. నైట్‌ అవుట్‌ల పేరుతో కుస్తీలు పడుతుంటారు. 3,4 గంటలు మాత్రమే పడు కుని మళ్లీ చదువుతుం టారు. ఇలాంటివారిని చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలపై కొంత ఒత్తిడి పెడుతుంటారు. ఇలా గంటలకొద్దీ కేటా యిస్తేనే సరైన పద్ధతిలో సిద్ధమవుతున్నట్లుగా భావిస్తారు.

ఫిబ్రవరి రెండోవారంలోకి వచ్చేశాం. మార్చినెల మొదటివారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ఆరంభం కానున్నాయి. తర్వాత పదోతరగతి పరీక్షలు. దీంతో విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్‌ మొదలైంది. ఇప్పటికే బాగా చదివేసినవాళ్లు ఇప్పుడే మొదలు పెట్టినవాళ్లు..ఇంకా ప్రిపరేషన్‌ ప్రారంభించాల్సిన వాళ్లు ఇలా విద్యార్థులు రకరాలుగా ఉన్నారు. అన్నీ గుర్తుంటాయో లేదో సమయం సరిపోతుందా ఎంత చదివితే ఈసారికి గట్టేక్కేస్తాం..అనే ఆలోచనలతో అయోమయంలో పడిపోతున్నారు. అంత ఆందోళన అవసరం లేదంటున్నారు నిపుణులు. కొంత తెలివిగా వ్యవహరించి కొన్ని మార్గాలను అనుసరిస్తే కోరుకున్న మార్కులను తేలిగ్గా సాధించుకోవచ్చని చెబుతున్నారు.

విద్యా సంవత్సరం చివరిదశకు వచ్చింది. ఇంటర్‌, టెన్త్‌ తుది పరీక్షలు సమీపిస్తు న్నాయి. విద్యార్థుల దృష్టంతా ప్రిపరేషన మీదే ఉంది. మంచి మార్కుల కోసమే ఆ తపనంతా. అందుకే కష్టపడి చదవమని విద్యార్థులను అందరూ ప్రోత్సహిస్తుంటారు. దీనివల్ల బయటనుంచీ, అంతర్గతంగానూ క్రమంగా ఒత్తిడి విస్తరించే అవకాశం ఉంది. దాన్ని అధిగమించి అనుకున్న లక్ష్యం అందుకోడానికి విద్యార్థులు తెలివిగా వ్యవహరిస్తూ సులువైన పద్ధతులు అనుసరించాలంటున్నారు నిపుణులు. నిజానికి పరీక్షలకు సిద్ధమవడం ఒక కళ. ఏడాదిపాటు చదివినదాన్ని కొన్ని వారాల పరిధిలో కవర్‌ చేయాలి. సమర్థంగా పూర్తిచేసిన వాళ్లే మంచి స్కోరు సాధించగలుగుతారు.

మొదటి నుంచీ చదవలేదే అని ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఉండదు. ఉన్న సమయాన్ని సరిగా ఉపయోగించుకోడానికి ప్రయత్నించాలి. అందుకు కష్టం, బలవంతంగా చదవడం పరిష్కారం కాదు. ఒక పద్ధతి ప్రకారం, స్మార్ట్‌గా చదివితే అనుకున్న మార్కులు సాధించుకోవచ్చు. ప్రస్తుతం మిగిలి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు.

అతిగా చదివితే అనర్ధమే:

పరీక్షలు కొద్ది రోజుల్లో ఉన్నాయంటే కొందరు 24 గంటలూ పుస్తకాలతోనే గడుపుతుంటారు. నైట్‌ అవుట్‌ల పేరుతో కుస్తీలు పడుతుంటారు. 3,4 గంటలు మాత్రమే పడుకుని మళ్లీ చదువుతుంటారు. ఇలాంటివారిని చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలపై కొంత ఒత్తిడి పెడుతుంటారు. ఇలా గంటలకొద్దీ కేటాయిస్తేనే సరైన పద్ధతిలో సిద్ధమవుతున్నట్లుగా భావిస్తారు. శరీరాన్ని అంతగా శ్రమ పెడితే పరీక్ష సమయానికి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. నేర్చుకోవడం కుదరకపోగా ఒత్తిడిలో వచ్చింఈ మర్చిపోవచ్చు ఎంతసేపు చదివారనేది కాదు. ఎంత నేర్చుకున్నారన్నదే ప్రధానం. ఒకరితో పోలిక పెట్టుకోకుండా విద్యార్థులు తమ శక్తిమేరకు ప్రణాళికలు వేసుకోవాలి. దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అదే అన్ని విధాలుగా ప్రయోజనకరం.

కఠినమైన అధ్యాయాలకే ప్రాధాన్యం ఇవ్వడం, వాటికే అధిక సమయం కేటాయించడం విద్యార్థులు సాధారణంగా చేసే పని. తేలికైనవి/ బాగా వచ్చినవి ఎలాగూ గుర్తుంటాయనే భావనతో వాటిని విస్మరిస్తుంటారు. దీనివల్ల నష్టాలు ఉన్నాయి. కొత్తవి నేర్చుకోవాలనే తపనలో ఇదివరకు వచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మర్చిపోయే ప్రమాదం ఉంది. కొంత విరామం తర్వాత పూర్తిగా కాకపోయినా కొంతైనా మర్చిపోవడం సహజం. వచ్చిన అధ్యాయాలు చేతిలో ఉన్న డబ్బుల్లాంటివి. వాటిని జాగ్రత్త చేసుకోకుండా మిగతావాటి కోసం ప్రయత్నిస్తే చేతిఓనివి చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి, వచ్చిన పాఠాలే కదా అని వదిలేయవద్దు. వాటిని పునశ్చరణ చేసిన తర్వాతే మిగతా ప్రశ్నలను చదవాలి.

పరీక్షలో ముఖ్యమైన పాయింట్లను హైలైట్‌ చేయడానికీ చాలామంది అండర్‌లైన్‌ చేస్తుంటారు. అది ఎగ్జామినర దృష్టిలో పడాలనే అలా చేస్తారు. సన్నద్ధత సమయంలోనూ అదే చేయవచ్చు. చదువుతున్న టాపిక్‌లోని ముఖ్యమైన పదాలు, పాయింట్లను పుస్తకంలో హైలైట్‌ చేసుకోవాలి. పరీక్ష ముందురోజు తుది సన్నద్ధతకు ఇది బాగా ఉపయోగపడు తుంది. ఆపై వాటిని ఒకసారి చూసుకుంటుంటే చదవింది ఫొటోగ్రఫిక్‌ మెమరీలాగా గుర్తుండిపోతుంది.

సాధారణంగా పదో తరగతి విద్యార్థులు మ్యాథ్స్‌ లేదా సైన్స్‌, ఇంటర్మీడియట్‌ అభ్యర్థులు గ్రూపు సబ్జెక్టులపై ప్రధానంగా దృష్టిపెట్టి చదువుతుంటారు. తెలుగు/ సంస్కృతం, ఇంగ్లిష్‌ సబ్జెక్టులను పరీక్ష ముందు కొద్దిరోజులు చదివితే సరిపోతుందని భావిస్తారు. పదో తరగతితో పోలిస్తే ఇంటర్‌ విద్యార్థుల్లో ఈ అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంటుంది. అన్ని సబ్జెక్టుల స్కోరు కలిపితేనే తుది మార్కులన్న విషయాన్ని గుర్తుంచు కోవాలి. వీటిలో మార్కులు తగ్గినా పర్సంటేజీపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, భాషాశాస్త్రాలకూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిపరే షన్‌లో వీటికి అవస రమైన సమయం కేటాయించాలి.

కొత్తపుస్తకాల జోలికి వద్దు

పరీక్షలగానే చాలామంది అప్పటివరకూ చూడని గైడ్‌లు, వేరే మెటీరియల్స్‌ సేకరించి చదివేస్తుంటారు. దీనివల్ల కొంత గం దరగో ళం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయోజనమూ తక్కువే. అందుకే మొదటి నుంచీ అనుసరిస్తున్న పుస్తకం/ మెటీరియల్‌నే కొనసాగించడం మంచిది. అవి ఇప్పటికే అలవాటై ఉంటాయి.
పైగా ఆ సమాచారంపై ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. చదవడం, రివిజన్‌ చేయడం సులభమవుతుంది. అందుకే కొత్తవాటి జోలికి వెళ్లకుండా ఉన్నవాటినే ఉపయోగిం చాలి. ప్రతి చాప్టర్‌కి సంబంధించిన ముఖ్యాంశాలను చదువుతున్నప్పుడే చిన్న పాయింట్ల రూపంలో రాసిపెట్టుకోవాలి. అన్ని సబ్జెక్టులకీ విడివిడిగా చేయాలి. పాయింటుగా మాత్రమే రాయాలి. మళ్లీ మొత్తం రాసుకోకూడదు. చిన్న పాయింట్లు, చిన్నమ్యాప్‌లు, బొమ్మలు లేదా సబ్‌ హెడ్డింగ్స్‌, కీవర్డ్స్‌లా రాసుకోవాలి. చూడగానే మొత్తం గుర్తుకురావాలి. పరీక్ష ముందు సులువుగా పునశ్చరణ (రివిజన్‌)కు వీలుగా ఉండాలి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ పార్ములాలనూ జాబితాగా రాసుకోవాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/