ఏపీలో పలు చోట్ల స్వల్పంగా భూ ప్రకంపనలు

ఏపీలో పలు చోట్ల స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అనేక గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించినట్టు గుర్తించారు. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. అలాగే ప్రకాశం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. గత నెలలో కూడా ఇదే ప్రాంతాల్లో భూమి కంపంచింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

ప్రకాశం జిల్లాలోని పామూరు మండలం రామగోపాలపురం, బోట్లగూడూరు, పామూరు టౌన్ లో భూ ప్రకంపనలు సంభించాయి. మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇళ్లు స్వల్పంగా కుదుపులకు గురికావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆరుబయట ఉండాలని అధికారులు సూచించారు. భవంతులు, భారీ చెట్ల దగ్గర ఉండవద్దని పేర్కొన్నారు.