ఛత్తీస్‌గఢ్ అంబికాపూర్‌లో 4.8 తీవ్రతతో భూకంపం

massive earthquake in Japan
earthquake

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్‌లో భూకంపం సంభవించింది. అంబికాపూర్‌ సమీపంలో శుక్రవారం ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.8గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. అంబికాపూర్‌కు 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు ఏర్పడ్డాయని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/