మంచిర్యాల జిల్లాలో భూ ప్ర‌కంప‌న‌లు..భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లాలోని చున్నం బట్టి వాడ, శ్రీ శ్రీ నగర్, సీతారాం పల్లి, నస్పూర్, సీతారాంపూర్ ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కనిపించింది. అదేవిధంగా పెద్దపల్లి లోనూ భూమి కంపించినట్టయిందని తెలుస్తోంది. కరీంనగర్ లోనూ భూమి కనిపించిందని సమాచారం. ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం తో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు.

కరీంనగర్ జిల్లాలో లేఖిని పై తీవ్రత 4 గా నమోదైంది. కరీంనగర్ కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ను అధికారులు గుర్తించినట్టు సమాచారం. పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకోవడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యనే మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఇదేవిధంగా భూమి కంపించిన సంగతి తెలిసిందే.